Wednesday 25 April 2012

LAST DAYS OF ACTRESS MADHUBALA



ఆమె అందంలానే ఆమె పేరూ అందమైనదే!
బాలనటిగా సినిమాల్లోకి ప్రవేశించిన మధుబాల
ఆ తర్వాత తన అందంతో, అభినయంతో ప్రేక్షకులను
ఆకట్టుకుంది.ఆమె చనిపోయిన రెండు దశాబ్దాల తర్వాత
1990లో ఓ సినిమా పత్రిక నిర్వహించిన బ్యాలెట్ లో
అత్యంత ప్రజాదరణ పొందిన ఏకైక హీరోయిన్ గా మధు
బాల ఎంపికైంది. దటీజ్ మధుబాల.
డైరెక్టర్ కమల్ అమ్రోహి, నటుడు ప్రేమనాథ్, అశోక్
కుమార్, దిలీప్ కుమార్, కేదార్ శర్మ, జుల్ఫికర్ ఆలీ భుట్టో
లను ప్రేమించి, వారిచేత ప్రేమించబడి చివరికి గాయ
కుడు కిషోర్ కుమార్ కి పేరుకే భార్యగా మారి, ప్రేమాభి
మానాలకు నోచుకోలేక, అర్ధాంతరంగా 36 ఏళ్ళకే జీవి
తాన్ని ముగించేసిందంటే విధి ఎంత బలీయమో!!
తండ్రి అతుల్లాఖాన్ అంటే ఆమెకెంతో గౌరవం.
ఆయన పదకొండుమంది సంతానంలో మధుబాల ఐదవ
బిడ్డ. తండ్రి మాట జవదాటాలంటే ఆమెకు భయం. ఆ
భయమే ఆమె జీవితాన్ని విషాదాంతంలో ముంచింది.
మధుబాల అసలు పేరు ముంతాజ్ జాన్ బేగం.
ముద్దు పేరు మజిలీ అప్పా. మధుబాలకు చిన్నప్పుడే
గుండెజబ్బు ఉంది. ఆ జబ్బుందన్న సంగతి ఆమెకు
తెలీదు. ఆ విషయం ఆమె తండ్రి దాచాడు.
ప్రముఖ నటుడు దిలీప్ కుమార్ ప్రేమను గెలుచు
కున్నా తండ్రి వ్యతిరేకతతో అతన్ని దూరంచేసుకుంది.
ఇది ఆమె జీవితంలో పెద్ద విషాదం. లేకుంటే అతనికి
భార్య అయ్యేది. దిలీప్ అంటే ఆమెకెంతో ఇష్టం.
17 సంవత్సరాల వయసులో దిలీప్ కుమార్ సరసన
నటించింది. ఆమె అందానికి ముగ్ధుడైన దిలీప్ కుమార్
కూడా మధుబాలను ప్రేమించాడు. తండ్రి అతుల్లాఖానకు,
దిలీప్ కుమార్‌కు మధ్య మనస్ఫ
ర్థలు రావడంతో దిలీపు
దూరంకావలసి వచ్చింది.
దిలీపుమార్ను వదులు
కున్నాక తానెంత తప్పుచేశానో
అర్థంచేసుకుంది ఆమె. ప్రేమకు
దూరమై కృంగిపోయింది. మాన
సికంగా దెబ్బతింది. దాంతో ఆమె
ఆరోగ్యం క్రమేపీ క్షీణించింది.
అటువంటి సమయంలో
కె.ఎ.ఆసిఫ్ 'మొఘల్ ఎ ఆజమ్'
చిత్రంలో దిలీప్ కుమార్ పక్కన
నటించే అవకాశంవచ్చింది. కాద
నలేకపోయింది. కారణం ప్రియు
డితో నటించే అవకాశం రావడం
ఒకటైతే, అనార్కలి వంటి గొప్ప
పాత్ర లభించడం రెండు.
వెంటనే ఓ.కే. చేసింది.
కానీ ఆ సినిమా షూటింగ్
జరుగుతున్నంతకాలం మధు
బాల తండ్రి ఆమెకు కాపలాగా
వుండటంతో దిలీపుమారో
మాట్లాడలేకపోయింది.
ఆమె తండ్రి అలా తమని
మాట్లాడుకోనీకుండా జాగ్రత్తపడ
టంచూసి అతనికి ఇబ్బంది అని
పించి, తటస్థంగా వుండిపోయేసరికి ఇద్దరూ ఎడమొఖం
పెడముఖంగా ఉండిపోయారు.ఆ చిత్రం పూర్తయ్యేలోగా
ఆమె ఆరోగ్యం మరింత దెబ్బతింది. అనారోగ్యంవల్ల ఆమె
తూలిపోతూండేది. ఆఖరి సీ లో నటించేప్పుడు సంకెళ్ళ
వల్ల చేతులకు, కాళ్ళకు గాయాలయ్యాయి.ఆమె ప్రేమే ఆమెకు
శత్రువైంది. ఏ ఒక్కరితోటి
ప్రేమ సక్సెస్ అవ్వక కృంగి
పోయింది. ఆ సమయంలో
కిషోర్‌కుమార్ గాయకుడిగా
పరిచయమై, అప్పుడప్పుడే
పైకొస్తున్నాడు.
అతన్ని వివాహం చేసు
కుంటే తనకో తోడు దొరు
కుతుంది అనుకుంది. ఆ

సమయంలో అప్పుల్లో మునిగివున్న కిషోర్ కుమార్ మధు
బాల అడగ్గానే ఆనందంగా ఒప్పుకున్నాడు.ఆమెను వివా
హం చేసుకున్నాడు. మధుబాలవల్ల అప్పుల ఊబిలోంచి
బైటపడ్డాడు.
కానీ ఆమె అంటే అతనికెంతమాత్రం ప్రేమ
లేదు. దాంతో ఇద్దరి మధ్య ఘర్షణలొచ్చాయి.
చివరికి అనారోగ్యంతో 1960ల్లో తన నట జీవితా
నికి స్వస్తి చెప్పింది. ఇంత చేస్తే అప్పటికి ఆమె వయసు
28 సంవత్సరాలే. గుండెజబ్బు తీవ్రమవడంతో మెరుగైన
చికిత్సకోసం ఇంగ్లండ్ కు వెళ్ళింది.ఆమె పరిస్థితిని చూసిన
డాక్టర్లు పెదవి విరిచారు. గుండె ఆపరేషన్‌కు తట్టుకోలేదని
స్థిరనిశ్చయానికి వచ్చారు. అదే చెప్పారు.
.
తిరిగి మాతృదేశం చేరుకుంది మధుబాల.
'ఆరాధన' సినిమా 1969లో విడుదలైంది.ఆ చిత్రంలో
కిషోర్‌కుమార్పడిన పాటలకు దేశమంతా ఉర్రూతలూగి
పోయింది. గాయకుడిగా డిమాండ్ పెరిగింది. ఆఫర్స్
ఇబ్బడి ముబ్బడిగా వచ్చిపడ్డాయి. ఆర్థికంగా కుదుట
పడ్డాడు. మధుబాలను నిర్లక్ష్యం చేశాడు.
.
ఏ ఒక్కరి ప్రేమా దక్కక చివరి రోజుల్లో అల్లాడి
పోయింది మధుబాల. కనీసం నోరారా పలకరించే మనిషే
లేడు. అప్పుడప్పుడు వచ్చి పలకరించే తన పుట్టింటివారు,
ఒకరిద్దరు సన్నిహితులు తప్ప ఇంకెవరూ వచ్చేవారు
కాదు. ఒంటరిగా వున్న సమయంలో తన ప్రేమికుల
గురించే ఎప్పుడూ ఆలోచిస్తూ వుండిపోయేది.
మధుబాల ఢిల్లీ నగరంలో వుండగా, ఇంకా ఆమె
అప్పటికి ముంబై చేరలేదు. సినిమాల్లోకి రాలేదు. ఆ
రోజుల్లో ఆమెకు లతీఫ్ అనే ఫ్రెండ్ వుండేవాడు. ఆమె
వస్తూవస్తూ అతనికో గులాబీపువ్వు ఇచ్చింది.చివరి రోజుల్లో
ఆమెకు అతను తరచుగా గుర్తిస్తుండేవాడు.
కేదార్ శర్మ, కమల్ అమ్రోహి, ప్రేమ నాథ్, అశోక్
కుమార్, దిలీప్ కుమార్, జుల్ఫికర్ ఆలీ భుట్టో, కిషోర్
కుమార్ ఇలా వరుసగా వారంతా ఆమె చివరి రోజుల్లో
గుర్తుకురాసాగారు. తన డైరీలో వారందరి జ్ఞాపకాలను
రాస్తూ, బాధపడుతూ వుండేది.
ఆఖరి ఘడియలు వచ్చాయని ఆమెకు అర్థమయ్యే
సరికి తానెంతో గాఢంగా ప్రేమించిన దిలీపుమారు
కలవరించడం మొదలు పెట్టింది. ఒక్కసారి వచ్చి కలసి
వెళ్ళమని ఉత్తరాల ద్వారా ప్రాథేయపడింది. దిలీప్
రాలేదు. ఆమెను పూర్తిగా మరిచిపోయాడు.ఆమె అప
రాధాన్ని అతను క్షమించలేకపోయాడు.
అయితే కూతురి దుఃఖాన్ని చూసిన ఆమె తండ్రి
కరిగిపోయాడు. ఒక్కసారి వచ్చి చూసి వెళ్ళమని ప్రాధేయ
పడ్డా దిలీప్ కరగలేదు. ఆ విషయం తెలిస్తే మరింత
బాధపడుతుందని తండ్రి చెప్పలేదు. దాంతో తీరని వేద
నతో అనారోగ్యం నుండి కోలుకోలేకపోయింది. చివరి
వరకు దిలీప్ కోసమే
నగరంలో వుండగా, ఎదురుచూసింది.
-డ్ వుండేవాడు. అంత దుఃఖాన్ని ఆమె
అతనికో గులాబీ
గుండె మోయలేకపో
యింది. 1969 ఫిబ్రవరి
ఆమె మరణించాక
23వ తేదీన మధుబాల
విధుబాల ఇచ్చిన
తనువు చాలించింది. ఆమె
ఆమె సమాధిమీద మరణించినా అభిమానుల
అలర్పించాడు.
గుండెల్లో చిరస్థాయిగా
మిగిలేవుంది.
దిలీప్ కుమార్ ఆఖరి క్షణంలో శ్మశానానికైనా వస్తా
డనుకున్నారంతా. అతను రాలేదు. మధుబాల తండ్రి
ఆమె డైరీని కూడా సమాధిచేశాడు.
మధుబాల మరణించాక ఆమె బాల్యమిత్రుడు
లతీఫ్ తనకు మధుబాల ఇచ్చిన గులాబీ పువ్వును ఆమె
సమాధి మీద ఉంచి నివాళులర్పించాడు. ఆమె జ్ఞాపకంగా
దాచుకున్నాడా గులాబీ పువ్వు.
ఆమె మరణించేనాటికి లతీఫ్ ఓ ఐఏఎస్ అధికారి.
ప్రతి సంవత్సరం ఆమె చనిపోయిన రోజు ఆమె సమాధి
మీద ఓ గులాబీ పువ్వును వుంచి వెళ్తుంటాడు.
'ప్యార్ కియాతో డర్‌
జబ్ ప్యార్ కియాతో
డర్‌ క్యా' 'మొఘల్ ఎ ఆజమ్'లో మధుబాల నర్తిస్తూ
నటించిన ఆ పాట మన చెవుల్లో ఇప్పటికీ, ఎప్పటికీ విన
బడుతూనే ఉంటుంది.
మధుబాల ఢిల్లీ నగరంలో వుండగా,
లతీఫ్ అనే ఫ్రెండ్ వుండేవాడు.
ఆమె వస్తూవస్తూ అతనికో గులాబీ
పువ్వు ఇచ్చింది. ఆమె మరణించాక
లతీఫ్ తనకు మధుబాల ఇచ్చిన
గులాబీపువ్వును ఆమె సమాధిమీద
ఉంచి నివాళులర్పించాడు. 

No comments:

Post a Comment